ఆలస్యమైతే వేటు తప్పదు.. ఐసీసీ ప్రయోగాత్మక రూల్ రేపటి నుంచే అమలు

ఆలస్యమైతే వేటు తప్పదు.. ఐసీసీ ప్రయోగాత్మక రూల్ రేపటి నుంచే అమలు

పురుషుల వన్డే, టీ20ల్లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నవంబర్ నెలలో కొత్త రూల్​ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రెండు ఫార్మాట్లలో నిర్ణీత సమయంలో ఆటను పూర్తి చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మధ్య 60 సెకండ్ల కంటే ఎక్కువ గ్యాప్‌‌‌‌‌‌‌‌ ఉండకూడదన్న రూల్‌‌‌‌‌‌‌‌ తెచ్చింది. ఈ రూల్ ను రేపటి నుంచి (డిసెంబర్ 12) అమలు చేయనున్నారు. డిసెంబర్ 12న బార్బడోస్‌లో వెస్టిండీస్, ఇంగ్లండ్‌ల మధ్య తొలి టీ20 మ్యాచ్‌తో ట్రయల్ ప్రారంభమవుతుంది.

ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు బార్బడోస్ వేదికగా రేపు తొలి టీ20 మ్యాచ్ ఆడనున్నాయి. ఈ రూల్ ప్రకారం బౌలింగ్‌‌‌‌‌‌‌‌ టీమ్ ఒక ఓవర్ వేసిన తర్వాత నిమిషంలోపు తర్వాతి ఓవర్ స్టార్ట్​ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం స్టాప్‌‌‌‌‌‌‌‌ క్లాక్‌‌‌‌‌‌‌‌ను ఉపయోగిస్తారు. ఒకవేళ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో మూడుసార్లు 60 సెకండ్ల రూల్‌‌‌‌‌‌‌‌ను బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేస్తే బౌలింగ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌కు ఐదు రన్స్‌‌‌‌‌‌‌‌ పెనాల్టీ విధించి వాటిని బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌  స్కోరులో జతచేస్తారని ఐసీసీ గవర్నింగ్‌‌‌‌‌‌‌‌ బాడీ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం జరిగిన తమ బోర్డు మీటింగ్‌‌‌‌‌‌‌‌లో నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. 

ఈ నిబంధనను  డిసెంబర్ నుంచి ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ వరకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని ఐసీసీ తెలిపింది. మెన్స్ వన్డే, టీ20ల్లో  ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ట్రయల్ ప్రాతిపదికన స్టాప్ క్లాక్‌‌‌‌‌‌‌‌ను ప్రవేశపెట్టడానికి క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (సీఈసీ) అంగీకరించింది. ఓవర్‌‌‌‌‌‌‌‌ల మధ్య తీసుకునే సమయాన్ని నియంత్రించడానికి ఈ నిబంధన ఉపయోగించబడుతుంది’ అని పేర్కొన్నది.