భారతదేశంలో వివిధ రకాల రుచికరమైన స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి. అందులో మ్యాగీ ఒకటి. మామూలుగా మ్యాగీ అంటే రూ.30 నుంచి రూ.150 ఉంటుంది. మరికొన్ని రెస్టారెంట్లలో మాత్రం ఈ ధర మరింత ఎక్కువగా ఉంటుంది. కానీ ఓ వీధి వ్యాపారి మాత్రం దీన్ని ఏకంగా రూ.400 విక్రయిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసి ఇంటర్నెట్ యూజర్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇన్ స్టాగ్రామ్ లో షేర్ అవుతోన్న ఈ వీడియోలో స్ట్రీట్ వెండర్ రెసిపీకి మరింత రుచిని యాడ్ చేసేందుకు రెండు పదార్థాలతో నూడిల్స్ తయారు చేస్తున్నట్టు కనిపించింది. ఈ రెసిపీలో నిజంగా చెప్పుకోవడానికి అంత గొప్పదనమేం లేకపోవడంతో నెటిజన్లు పలు విమర్శలు చేస్తున్నారు. మ్యాగీకి 400 రూపాయలా.. దీనికి బంగారం కలుపుతున్నారా అనే క్యాప్షన్ తో షేర్ అవుతోన్న ఈ వీడియోపై భిన్న రీతిలో కామెంట్లు వస్తున్నాయి. సాధారణ మ్యాగీ ప్లేట్కు ఇంత భారీ మొత్తం చెల్లించే బదులు మరేదైనా కొనుగోలు చేయాలని కొందరు భావించారు. రూ. 400కి 2 ప్లేట్ల మటన్ కర్రీ తీసుకోవచ్చు అని ఇంకొకరు కామెంట్ చేశారు.