భారతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థ పటిష్టం

భారతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థ పటిష్టం

భారతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థ సురక్షితంగా,పటిష్టంగా ఉందన్నారు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక పరిస్థితిని అదుపులో ఉంచేందుకు తగిన శక్తి సామర్థ్యాలు RBI దగ్గర చాలా ఉన్నాయన్నారు. ఒక వెబ్‌నార్‌ సిరీస్‌ ఈవెంట్‌ లో  మాట్లాడిన శక్తికాంత దాస్…  సంక్షోభం ముగిసిన తర్వాత ఆర్థిక స్థిరీకరణకోసం చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బ్యాంకులు తమ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలన్నారు. సెంట్రల్‌ బ్యాంకింగ్‌ విధానాలు కానీ .. రేటు తగ్గింపు అంశంలో తమ విధానాలను మార్చలేదన్నారు శక్తికాంత దాస్.