భీమిలి బీచ్ లో విద్యార్థి మృతి

భీమిలి బీచ్ లో విద్యార్థి మృతి

వైజాగ్ : భీమిలి బీచ్ లో పండుగ రోజున విషాద చాయలు అలముకున్నాయి. బీచ్ లో స్నానానికి వెళ్లిన ఓ యువకుడు మృతి చెందాడు. విశాఖ ఆరిలోవకు చెందిన ఐదుగురు విద్యార్థులు గురువారం భీమిలి బీచ్ కు విహారానికి వెళ్లారు. అందులో ఇద్దరు సముద్రంలో స్నానం చేయడానికి దిగి గల్లంతయ్యారు. కాసేపటికి మత్య్సకారులకు ఓ బాలుడి డెడ్ బాడీ దొరికింది. మరో విద్యార్థి ఆచూకి తెలియాల్సి ఉంది.

ఈ ప్రాంతంలో గోస్తనీ నది సముద్రం కలిసే ప్రాంతం, లోతట్టు ప్రదేశం కావడంతో విద్యార్దుల గల్లంతుకు ప్రధాన కారణమని స్దానిక మత్స్య కారులు చెబుతున్నారు.