గుక్క తిప్పకుండా చిరంజీవి డైలాగ్ చెప్పిన విద్యార్థిని

గుక్క తిప్పకుండా చిరంజీవి డైలాగ్ చెప్పిన విద్యార్థిని

సమాజంలో పెరిగిపోతున్న లంచంపై ఠాగూర్ సినిమాలో  మెగాస్టార్ చిరంజీవి చెప్పిన డైలాగ్ ఒకప్పుడు ఎంతో ఫేమస్. 2003లో వచ్చిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో వినాయక్ ఓ పాత్రలో కూడా నటించారు.అప్పట్లో ఈ సినిమా పెద్ద హిట్ కొట్టింది.ఠాగూర్ సినిమాలో సొసైటీలో ఏపని లంచం లేకుండా జరగదని రెండు నిమిషాల పాటు చిరు చెప్పిన డైలాగ్ అప్పట్లో జనాల్లో మేల్కొలుపును తెచ్చింది. అదే డైలాగును ఓ విద్యార్థిని గుక్క తిప్పకుండా చెప్పి మరోసారి గుర్తు చేసింది. సంక్రాంతి సంధర్భంగా వికారాబాద్ జిల్లా  పరిగిలోని ప్రతిభా స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మైత్రి వర్దిని అనే విద్యార్థిని డైలాగ్ చెప్పి అందరితో చప్పట్లు కొట్టించింది.ఇప్పుడు ఆ విద్యార్థిని చెప్పిన డైలాగ్ విడియో స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరితో శభాష్ అనిపిస్తోంది.