నారాయణ్ ఖేడ్, వెలుగు: ఫీజు రీయింబర్స్మెంట్ , స్కాలర్షిప్ బకాయిల చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ సంగారెడ్డి జిల్లానారాయణ ఖేడ్ ఏబీవీపీ నాయకులు గురువారం గేదెకి వినతి పత్రం ఇచ్చి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘం కార్యదర్శి నందు మాట్లాడుతూ తెలంగాణ సర్కారు విద్యా వ్యవస్థను పూర్తిగా నిరక్ష్ల్యం చేస్తోందని ఆరోపించారు. కార్యక్రమం లోనాయకులు పవన్, విశాల్, నందు, బాబు రావు, గోపాల్, బీజేపీ ఐటీ సెల్ కన్వీనర్శ్రీనివాస్ పాల్గొన్నారు.