న్యూఢిల్లీ: ఆపత్కాలంలో అలుపెరుగకుండా ముందు వరుసలో సేవలందిస్తున్న పోలీసులకు ప్రముఖ శాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ నివాళి అర్పించారు. ఒడిశాలోని పూరి బీచ్ లో ఓ ఆర్ట్ వర్క్ ను ఆయన రూపొందించారు. మట్టితో తయారు చేసిన ఈ ఆర్ట్ వర్క్ లో ఇంటి వద్దే ఉండండి, సురక్షితంగా ఉండండి అనే మెసేజ్ తోపాటు మీ కోసం మేం ఉన్నాం అని పోలీసు క్యాప్ ఉంచి వేసిన ఆర్ట్ చూపరులను ఆకర్షిస్తోంది.
Salute to our Police force….? who dedicate their lives day and night to fight against #COVID19 . One of my SandArt at puri beach with message #WeStandForYou #StayHomeStaySafe pic.twitter.com/1Y2it1WfUw
— Sudarsan Pattnaik (@sudarsansand) May 14, 2020
ఈ ఆర్ట్ వర్క్ వీడియోకు జతగా హిందీ మూవీ కేసరిలోని పాపులర్ సాంగ్ తెరి మిట్టీని జత చేశారు. ‘మన పోలీసులకు సెల్యూట్. కరోనాతో రాత్రింబవళ్లు పోరాడుతున్నందుకు కృతజ్ఞతలు’ అని సుదర్శన్ ట్వీట్ చేశారు. ఈ ఆర్ట్ వర్క్ కు నెటిజన్స్ నుంచి మంచి ఆదరణ వస్తోంది. చాలా మంది బాగుందని, బ్యూటిఫుల్ అని కామెంట్ చేస్తున్నారు.