శాండ్ ఆర్ట్ తో పోలీసులకు సుదర్శన్ పట్నాయక్ నివాళి

శాండ్ ఆర్ట్ తో పోలీసులకు  సుదర్శన్ పట్నాయక్ నివాళి

న్యూఢిల్లీ: ఆపత్కాలంలో అలుపెరుగకుండా ముందు వరుసలో సేవలందిస్తున్న పోలీసులకు ప్రముఖ శాండ్ ఆర్టిస్ట్‌ సుదర్శన్ పట్నాయక్ నివాళి అర్పించారు. ఒడిశాలోని పూరి బీచ్ లో ఓ ఆర్ట్ వర్క్ ను ఆయన రూపొందించారు. మట్టితో తయారు చేసిన ఈ ఆర్ట్ వర్క్ లో ఇంటి వద్దే ఉండండి, సురక్షితంగా ఉండండి అనే మెసేజ్ తోపాటు మీ కోసం మేం ఉన్నాం అని పోలీసు క్యాప్ ఉంచి వేసిన ఆర్ట్ చూపరులను ఆకర్షిస్తోంది.

ఈ ఆర్ట్ వర్క్ వీడియోకు జతగా హిందీ మూవీ కేసరిలోని పాపులర్ సాంగ్ తెరి మిట్టీని జత చేశారు. ‘మన పోలీసులకు సెల్యూట్. కరోనాతో రాత్రింబవళ్లు పోరాడుతున్నందుకు కృతజ్ఞతలు’ అని సుదర్శన్ ట్వీట్ చేశారు. ఈ ఆర్ట్ వర్క్ కు నెటిజన్స్ నుంచి మంచి ఆదరణ వస్తోంది. చాలా మంది బాగుందని, బ్యూటిఫుల్ అని కామెంట్ చేస్తున్నారు.