వృద్ధ దంపతుల ఆత్మహత్య.. నాలుగు రోజులుగా ఇంట్లోనే డెడ్‌ బాడీలు

వృద్ధ దంపతుల ఆత్మహత్య.. నాలుగు రోజులుగా ఇంట్లోనే డెడ్‌ బాడీలు

హైదరాబాద్: కుటుంబ సభ్యులందరికీ దూరంగా ఉంటూ జీవనం గడుపుతున్న వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వనస్థలిపురం క్రిస్టియన్ కాలనీలో వృద్ధ దంపతుల ఆత్మహత్య చేసుకున్న విషయం ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో మంగళవారం వెలుగులోకి వచ్చింది. నాలుగైదు రోజుల క్రితమే వీరు ఆత్మహత్య చేసుకుని ఉంటారని.. మృతదేహాలు డీకంపోజ్ కావడంతో దుర్వాసన వ్యాపించడంతో చుట్టుపక్కల వారి ద్వారా బయటకు వచ్చింది.

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గుమ్మడివెళ్లి గ్రామానికి చెందిన మోహన్ రెడ్డి(70) అనంత లక్ష్మీ (65) భార్యాభర్తలు. మోహన్ రెడ్డి ఆరోగ్యశాఖలో పనిచేసి రిటైర్ అయ్యారు. గత కొంతకాలంగా కొడుకులకు దూరంగా ఉంటూ ఒంటరిగా ఉంటున్నారు ఈ వృద్ధ దంపతులు. ఏం జరిగిందో గాని ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణం అనీ తెలుస్తోంది. వీరిద్దరూ గత  4రోజుల క్రితం ఆత్మ హత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.