ఎండాకాలం ముందే వచ్చేసింది.. హైదరాబాద్ లో పెరిగిన ఉష్ణోగ్రతలు

ఎండాకాలం ముందే వచ్చేసింది.. హైదరాబాద్ లో పెరిగిన ఉష్ణోగ్రతలు

చలికాలం దగ్గరపడుతుుండటంతో  ఈ సారి అపుడే ఎండలు స్టార్ట్ అయ్యాయి. మార్చి రాకముందే హైరాబాద్  లో ఉష్ణోగ్రతలు పెరిగాయి.   పలు ఏరియాల్లో  కనిష్ణ ఉష్ణోగ్రత 19 డిగ్రీలు.. గరిష్ట ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలు నమోదవ్వగా..కొన్ని ఏరియాల్లో 35 డిగ్రీ  వరకు నమోదవుతున్నాయి.

కొన్ని ప్రాంతాల్లో  హైదరాబాద్‌లో వేసవి తరహా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎప్పుడైనా ఫిబ్రవరిలో గరిష్ట ఉష్ణోగ్రత   19 డిగ్రీల వరకు నమోదయ్యేవి.. కానీ ఈ సారి 34 డిగ్రీలు నమోదయ్యాయి.  మరో రెండు రోజుల పాటు   గరిష్ట ఉష్ణోగ్రత 31 నుండి 33 డిగ్రీల సెల్సియస్‌లో నమోదయ్యే అవకాశం ఉంది.

 హైదరాబాద్ లో ఏ ఏరియాలో ఎంతంటే.?

  • ముషీరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత:  34.9 డిగ్రీల సెల్సియస్
  • గోల్కొండ : 34.0
  • ఖైరతాబాద్ :  35.1
  • ఆసిఫ్‌నగర్:   34.6
  • షేక్‌పేట: 34.8
  • మోండామార్కెట్:  34.5
  • చార్మినార్:  34.7
  • అమీర్‌పేట్: 35.0