IND vs ENG 2025: అలా చేస్తే దిగ్గజాలకు అన్యాయం జరిగినట్టే: పటౌడీ ట్రోఫీ పేరు మార్చడంపై గవాస్కర్ ఫైర్

IND vs ENG 2025: అలా చేస్తే దిగ్గజాలకు అన్యాయం జరిగినట్టే: పటౌడీ ట్రోఫీ పేరు మార్చడంపై గవాస్కర్ ఫైర్

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య శుక్రవారం (జూన్ 20) లీడ్స్ వేదికగా ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఛాంపియన్ షిప్ 2025-27 సైకిల్ లో ఇరు జట్లకు ఇదే తొలి సిరీస్. ఒక్క రూట్ తప్పితే ఇరు జట్లలో దాదాపు మొత్తం యంగ్ ప్లేయర్లతోనే నిండిపోయింది. దీంతో ఈ సారి ఈ సిరీస్ కు కొత్త కల రానుంది. ఇండియా, ఇంగ్లండ్‌ మధ్య జరిగే ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ ట్రోఫీకి పేరును కూడా మార్చనున్నారు. పటౌడీ ట్రోఫీ పేరు తొలగిస్తూ సచిన్ టెండూల్కర్‌–జేమ్స్‌ అండర్సన్‌ పేరు మీద నిర్వహించడం ఖారారైంది. దివంగత పటౌడీ పేరు మార్చడంపై భారత దిగ్గజ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

ఇప్పటికే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పటౌడీ ట్రోఫీ పేరు మార్చవద్దని భారత క్రికెట్ దిగ్గజం, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ భావిస్తున్నాడట. ఈ మేరకు సచిన్ బీసీసీఐ, ఈసీబీతో మాట్లాడి రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం. సచిన్ తో పాటు తాజాగా టీమిండియా దిగ్గజ ఓపెనర్ సునీల్ గవాస్కర్ సైతం పటౌడీ పేరుతో ఉన్న ట్రోఫీని మార్చడానికి వీలు లేదని భావిస్తున్నాడు. మన్సూర్ అలీ ఖాన్ పటౌడి పేరు మీద పెట్టబడిన ఈ ట్రోఫీని రీబ్రాండ్ చేయాలనే నిర్ణయం భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌కు నచ్చలేదు. దీనిపై మాట్లాడుతూ, ట్రోఫీని రీబ్రాండ్ చేయడం దివంగత మున్సూర్ అలీ ఖాన్ పటౌడికి అన్యాయం చేసినట్టే అని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. 

ALSO READ | Best Test XI of the 21st Century: ఈ శతాబ్దపు బెస్ట్ టెస్ట్ ప్లేయింగ్ 11 ప్రకటించిన విలియంసన్, హేడెన్

భారత క్రికెట్‌కు ఆయన చేసిన కృషిని మర్చిపోకూడదని సూచించారు. గవాస్కర్ మాట్లాడుతూ.. "ఇంగ్లాండ్, భారత్ మధ్య ఇంగ్లాండ్‌లో జరిగిన టెస్ట్ సిరీస్ విజేతలకు ఇచ్చే పటౌడీ ట్రోఫీని ఈసీబీ రద్దు చేయబోతోందనే వార్తలు నిజంగా కలవరపెడుతున్నాయి. వ్యక్తిగత ఆటగాళ్ల రిటైర్మెంట్  తర్వాత వారి పేరుతో ట్రోఫీ పెట్టడం గురించి వినడం ఇదే మొదటిసారి. అయితే ఈ నిర్ణయం పూర్తిగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుదే. బీసీసీఐకి కూడా ఈసీబీ సమాచారం ఇచ్చి ఉండవచ్చు. పేరు మారిస్తే ఇంగ్లాండ్, ఇండియా క్రికెట్‌కు పటౌడీలు చేసిన కృషికి గుర్తింపు లేనట్టే. భవిష్యత్తులో ట్రోఫీ రీబ్రాండింగ్ జరిగే సందర్భాలు లేవని ఆశిస్తున్నా". అని గవాస్కర్ చెప్పుకొచ్చారు. 

ఇంగ్లండ్‌ గడ్డపై భారత్‌–ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగే ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌ను 2007 నుంచి మన్సూర్‌ అలీఖాన్‌ (ఎంఏకే) పటౌడీ ట్రోఫీ పేరిట నిర్వహించడం జరుగుతోంది. ఇంగ్లండ్‌-భారత్‌ మధ్య టెస్టు మ్యాచ్‌ జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని 2007లో ఈ ట్రోఫీని ఆరంభించారు. ఎంఏకే పటౌడీ 1961 నుంచి 1975 మధ్యకాలంలో భారత జట్టు తరఫున 46 టెస్టులు ఆడారు. 34.91 సగటుతో 2793 పరుగులు చేశాడు. వీటిలో  ఆరు సెంచరీలు.. 16 హాఫ్ సెంచరీలు  ఉన్నాయి. అతను ఆడిన 46 టెస్టుల్లో 40 టెస్ట్‌లు  ఇండియా కెప్టెన్ గా చేసాడు. 1967లో న్యూజిలాండ్‌పై భారతదేశం తొలి విదేశీ టెస్ట్ విజయాన్ని సాధించింది. పటౌడీ మొత్తం 310 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.