బిగ్బాస్ సీజన్7 గ్రాండ్ ఫినాలేకి స్టార్ గెస్ట్.. నెక్స్ట్ లెవల్లో ప్లాన్ చేసారుగా!

బిగ్బాస్ సీజన్7 గ్రాండ్ ఫినాలేకి స్టార్ గెస్ట్.. నెక్స్ట్ లెవల్లో ప్లాన్ చేసారుగా!

తెలుగు బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7) చివరి దశకు చేరుకుంది. మరో రెండు రోజుల్లో ఈ సీజన్ విజేత ఎవరనే ఉత్కంఠకు తెరపడనుంది. ఓటింగ్ కి కూడా మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండటంతో.. ఎవరి ఫెవరేటే కంటెస్టెంట్స్ కి వాళ్లు ఓట్ చేస్తూ సపోర్ట్ చేసుకుంటున్నారు ఆడియన్స్. దీంతో.. ఓటింగ్ లెక్కలు క్షణక్షణానికి మారుతున్నాయి. ప్రస్తుతం ఇంట్లో టాప్ సిక్స్ ఉన్నప్పటికి.. ఇద్దరి మధ్య మాత్రమే టైటిల్ వార్ జరుగనుందని ఓటింగ్ చూస్తే క్లియర్ గా అర్థమవుతోంది. 

ఆ ఇద్దరు మరెవరో కాదు పల్లవి ప్రశాంత్, అమర్ దీప్. ఈ ఇద్దరి మధ్యనే టైటిల్ పోరు చాలా గాట్టిగా జరుగుతోంది. అందులో పల్లవి ప్రశాంత్ కు కాస్త ఎక్కువ ఓటింగ్ జరుగుతుతోంది. కారణం.. అతను రైతు బిడ్డగా అడుగుపెట్టడం, టాస్కుల్లో కూడా తన సత్తా చాటుకోవడం. దీంతో పల్లవి ప్రశాంత్ కు ఓటింగ్ బాగా పడుతోంది. నిజానికి అమర్ కు కూడా విన్నింగ్స్ చాన్సెస్ ఉండేవి.. కానీ ముందు నుండి అతను ఫౌల్ గేమ్స్ ఆడటం. ఓవర్ ఎమోషనల్ అయ్యి అరవడం అనేది అతనికి మైనస్ గా మారింది. అయినప్పటికీ ఓటింగ్ లో పల్లవి ప్రశాంత్ కి టఫ్ ఫైట్ ఇస్తున్నారు అమర్ దీప్. అందుకే ఏ సీజన్ విన్నర్ ఎవరనేదానిపై ఇంకా క్లారిటీ రావడంలేదు. 

ఇక ఈ లెక్కలు కాసేపు పక్కన పెడితే.. బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే కోసం స్టార్ గెస్ట్ ను తీసుకొస్తున్నారట మేకర్స్. ఆ స్టార్ గెస్ట్ మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు. అవును డిసెంబర్ 17న జరుగనున్న ఫైనల్ ఎపిసోడ్ కోసం మహేష్ బాబు చీఫ్ గెస్ట్ గా రానున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఫినాలే స్టేజిపై మహేష్ ఎవరి చేయి పైకి ఎత్తుతారు అనేది ఇపుడు ఉతకంతగా మారింది. ఇక మహేష్ హీరోగా చేస్తున్న గుంటూరు కారం మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకుకే రానుంది. కాబట్టి.. ప్రమోషన్స్ కూడా చేసినట్టు ఉంటుందని మహేష్ ఒప్పుకున్నారని సమాచారం.