పోలింగ్ బూతుల్లో డ్రంక్ అండ్ ఓటు టెస్ట్ పెట్టాలి : పిటీషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

పోలింగ్ బూతుల్లో డ్రంక్ అండ్ ఓటు టెస్ట్ పెట్టాలి : పిటీషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు పేరు వినే ఉంటారు.. తాగి రోడ్డు మీద వాహనం నడిపితే ఈ టెస్ట్ నిర్వహిస్తారు.. కానీ మీరు ఎప్పుడైన డ్రండ్ అండ్ ఓటు టెస్టు పేరు విన్నారా... అవును మీరు చదివింది నిజమే డ్రంక్ అండ్ ఓటు.. ఎన్నికల్లో ఓటు వేసేముందు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటీషన్ పై సుప్రీం కోర్టు ఎలాంటి రియాక్షన్ ఇచ్చందో తెలుసుకోవాలంటే పూర్తిగా చదవండి..

ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టేసింది. జస్టిస్‌లు సంజీవ్ ఖన్నా మరియు దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.

 పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించే ప్రతి వ్యక్తి ఒక వ్యక్తికి ముందుగా బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు లోనయ్యేలా చూడాలని, భారత ఎన్నికల కమిషన్‌కు ఈ విధమైన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని మొదట ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేసింది జనవాహిని పార్టీ. హైకోర్టు ఫిబ్రవరి 28న పిటిషన్‌ను కొట్టివేసింది. 

పిటిషన్ కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ జనవాహిని పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు ఈ పిటిషన్ ను పరిశీలించి హైకోర్టు ఉత్తర్వులపై జోక్యం చేసుకోవాడానికి నిరాకరిస్తున్నట్టు తెలుపింది.