
హైదరాబాద్, వెలుగు: గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా సంస్థ విడుదల చేసిన 'భారతదేశంలో పని చేయడానికి ఉత్తమ కంపెనీలు 2025' జాబితాలో సింక్రోనీ ఇండియా రెండో స్థానంలో నిలిచింది. ఇది ఉద్యోగుల పట్ల తమకున్న నిబద్ధతను, అద్భుతమైన కార్యాలయ సంస్కృతిని మరోసారి చాటి చెప్పిందని సింక్రోనీ పేర్కొంది. --సింక్రోనీ ఇండియాకు ప్రస్తుతం 5,600 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. గత పదేళ్లలో, కస్టమర్- ఫేసింగ్ ఆపరేషన్స్ హబ్గా ప్రారంభమై, ఇప్పుడు గ్లోబల్ డెలివరీ ఎక్సలెన్స్ కేంద్రంగా మారింది. పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్, అనలిటిక్స్, క్రెడిట్, రిస్క్, ఇంటర్నల్ ఆడిట్, టెక్నాలజీ అండ్ ఆపరేషన్స్, ఫైనాన్స్, హెచ్ఆర్, లీగల్ వంటి విభాగాలలో సేవలు అందిస్తోంది.