తమిళనాడు రాష్ట్ర గీతంగా తమిళ్ థాయ్ వాళ్తు

తమిళనాడు రాష్ట్ర గీతంగా తమిళ్ థాయ్ వాళ్తు

తమిళనాడు  ప్రభుత్వం రాష్ట్ర గీతాన్ని  ప్రకటించింది .‘తమిళ్ థాయ్ వాళ్తు’పాటను  రాష్ట్ర గీతంగా ఇవాళ (శుక్రవారం) అధికారికంగా ప్రకటన చేసింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఈ రాష్ట్ర గీతాన్ని ఇక నుంచి ప్లే చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర గీతం వచ్చేటప్పుడు దివ్యాంగులు తప్ప మిగతా వారంతా లేచి నిలబడాల్సిందేనని ఆదేశాల్లో తెలిపింది.

ఇటీవల మద్రాసు హైకోర్టులో ‘తమిళ్ థాయ్ వాళ్తు’ పాటపై పిటిషన్ దాఖలైంది. అది కేవలం ఓ పాట మాత్రమేనని, ఏ కార్యక్రమంలోనూ ఎవరూ లేచి నిలబడాల్సిన అవసరం లేదని తెలుపుతూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ ఏడాది స్నాతకోత్సవం సందర్భంగా ఐఐటీ-మద్రాస్ లో ఆ పాటనూ ప్లే చేయలేదు. దీంతో వివాదం తలెత్తింది. దీనిపై తమిళనాడు విద్యా శాఖ మంత్రి లేఖ కూడా రాశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ప్రకటించింది.