119 నియోజకవర్గాల ముఖ్య నేతలతో తరుణ్ చుగ్ సమావేశం

119 నియోజకవర్గాల ముఖ్య నేతలతో తరుణ్ చుగ్ సమావేశం

రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల ముఖ్య నేతలతో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ లు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జిలు, జిల్లా ఐటీ సెల్ సెక్రటరీలు పాల్గొన్నారు. 

119 నియోజకవర్గాలకు చెందిన పాలక్, ప్రభారిలు, కన్వీనర్ లు, విస్తారక్ లతో..బూత్ కమిటీల ఏర్పాటుపై రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిలు చర్చించారు. ఈ నెల 7న చేపట్టే 34,600 బూత్ కమిటీలకు చెందిన 7 లక్షల 26 వేల 600 మందితో జేపీ నడ్డ వర్చువల్ సమావేశం సక్సెస్ పై సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ చర్చించారు.