ఉపాధ్యాయుడి ఆత్మహత్య.. భవనంపై నుంచి దూకిన భార్య

ఉపాధ్యాయుడి ఆత్మహత్య.. భవనంపై నుంచి దూకిన భార్య

మెదక్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని శివ్వంపేట మండలం చిన్న గొట్టిముక్కల తండాలో రామారావు అనే వ్యక్తి  ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.  రామారావు సికింద్రాబాదులో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ విషయం తెలియగానే... అతని భార్య కూడా అఘాయిత్యానికి పాల్పడింది. నర్సాపూర్ లో నివాసం ఉంటున్న రామారావు భార్య రెండో అంతస్తు భవనంపై నుంచి కిందకు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. ఉపాధ్యాయుడి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.