
కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బీసీసీఐ టీం తన వంతు కృషి చేస్తోంది. ఇందులో బాగంగానే టీమ్ మాస్క్ ఫోర్స్ పేరుతో వీడియోను రూపొందించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించే విధంగా, ప్రజలను ప్రోత్సహించేవిధంగా… స్టార్ క్రికెటర్లు కోహ్లీ, సచిన్, స్మృతి మంధాన, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తదితరులతో రూపొందించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది బీసీసీఐ. ఆరోగ్యసేతు మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సురక్షితంగా ఉండండి అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేసింది.
సచిన్ టెండూల్కర్ మాట్లాడు తూ మాస్కులు తయారు చేసి మాస్క్ ఫోర్స్ లో భాగం కావాలని పిలుపునిచ్చారు సచిన్ టెండూల్కర్. 20సెకన్ల పాటు చేతులు కడుక్కోవడం, సామాజిక దూరాన్ని పాటించడం గుర్తుంచుకోవాలని తెలిపాడు.
#TeamIndia is now #TeamMaskForce!
Join #IndiaFightsCorona and download @mygovindia's @SetuAarogya mobile application ?@PMOIndia @narendramodi ?? pic.twitter.com/M06okJhegt
— BCCI (@BCCI) April 18, 2020