
రైలు ప్రయాణాన్ని కూడా పిక్నిక్ లా ఫీల్ అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు. ముఖ్యంగా మన ఇండియాలో రైలు ప్రయాణాలు భలే గమ్మత్తుగా ఉంటాయి. మన మిడిల్ క్లాస్ జనాలకు రైలు ప్రయాణం కూడా హాలిడే ట్రిప్ లాంటిదనే చెప్పచ్చు. ఇంటిల్లిపాది చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ.. రైల్లోనే భోజనాలు కూడా కానిస్తూ సందడిగా ఉంటుంది వాతావరణం. ఇదిలా ఉంటే.. ఎక్కడా లేని వింతలు కూడా మన రైళ్లలోనే కనిపిస్తూ ఉంటాయి.. బెర్తుల మధ్య ఉన్న గ్యాప్ లో చీరలతో చిన్నపిల్లలకు ఉయ్యాలలు, లగేజి షెల్ఫ్ లపై కూడా మనుషులు కూర్చోవడం వంటి వింతలు కామన్. కానీ, ఈ వీడియోలో జరిగిన ఘటన మాత్రం ఎప్పుడూ చూసి ఉండరు.. ఓ వ్యక్తి ఏకంగా ట్రైల్లోకే టేబుల్ ఫ్యాన్ తెచ్చుకొని దర్జాగా ప్రయాణిస్తున్నాడు. నెట్టింట వైరల్ గా మారిన ఈ వీడియోకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
గోమతి ఎక్స్ప్రెస్, రైలు నంబర్ 12420లో చోటు చేసుకుంది ఈ ఆసక్తికర ఘటన. నెటిజన్లు ఈ వీడియోను తమ సోషల్ మీడియా షేర్ చేస్తూ టెక్నలాజియా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ టెక్నాలజీ మ్యాన్ రైల్లో తోటి ప్రయాణికులనే కాకుండా ఇప్పుడు ఇంటర్నెట్లో కూడా హల్చల్ చేస్తున్నాడు.
ఓ నెటిజన్ ఇంస్టాగ్రామ్ లో ఈ వీడియోను షేర్ చేసినదాన్ని బట్టి చూస్తే.. ఈ ఘటన రెండు వారాల క్రితం జరిగినట్లు తెలుస్తోంది. రైల్లో ప్యాసెంజర్ టేబుల్ ఫ్యాన్ ఆన్ చేసుకొని దర్జాగా కూర్చున్న వీడియోకి ఇటీవల వైరల్ గా మారిన టెక్నలాజియా అనే ఆడియోను జత చేసి షేర్ చేశారు సదరు నెటిజన్. ఈ వీడియో ఇంస్టాగ్రామ్ లో 1.7 మిలియన్ల వ్యూస్, 34 వేలకు పైగా లైక్స్ తో వైరల్ గా మారింది.