వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లాలోని మైనారిటీ విద్యార్థులకు సీఎం ఓవర్సీర్ పథకం కింద స్కాలర్షిప్ కోసం అఫ్లై చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిణి సుధారాణి ప్రకటనలో తెలిపారు. విదేశీ యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ చదవడానికి 60 శాతం మార్కులు, పోస్టు గ్రాడ్యుయేట్ చేయడానికి పీజీలో 60 శాతం మార్కులు రావాలన్నారు.
దరఖాస్తుదారుడి కుటుంబ సంవత్సరం లోపు ఆదాయం రూ. 5 లక్షల వరకు ఉండాలన్నారు. మార్చి 23 అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అన్నారు. ఇతర వివరాల కోసం 9440685713 సంప్రదించాలని సూచించారు.