- హాజరుకానున్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, వెలుగు : పీసీసీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10.30 గంటలకు గాంధీ భవన్ లో బీజేపీపై కాంగ్రెస్ చార్జ్షీట్ విడుదల చేయనుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ అభ్యర్థులు, ఏఐసీసీ, పీసీసీ నేతలు హాజరు కానున్నారు. ప్రజలకు మోదీ సర్కార్, బీజేపీ నాయకత్వం ఇచ్చిన హామీలు, వాటిని విస్మరించిన తీరు, తెలంగాణ విషయంలో కేంద్రం ఏ విధంగా వివక్ష చూపిందనేది ఇందులో ప్రధానంగా ప్రస్తావించనున్నారు.