హైదరాబాద్, వెలుగు : నేషనల్ మాస్టర్స్ గేమ్స్లో తెలంగాణ టీమ్ పోటీ పడనుంది. ఫిబ్రవరి 8 నుంచి 14 వ తేదీ వరకు గోవాలో జరిగే టోర్నీలో రాష్ట్రం నుంచి మొత్తం 246 మంది క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు.
అథ్లెటిక్స్, ఆర్చరీ, హాకీ, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో తెలంగాణ ప్రాతినిథ్యం వహించనున్నారు. ఈ టోర్నీలో పాల్గొనే రాష్ట్ర క్రీడాకారులు ధరించే జెర్సీలను ఆలిండియా మాస్టర్స్ గేమ్స్ చైర్మన్ కొలన్ జగజీవన్ రెడ్డి ఆదివారం భెల్ హాకీ స్టేడియంలో ఆవిష్కరించారు.