
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 602 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,64,128 కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనా బారినపడి మరో ముగ్గురు చనిపోfవడంతో మొత్తం మరణాల సంఖ్య 1,433కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1015 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వీటితో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 2,51,468 గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,227 కేసులు యాక్టివ్గా ఉన్నాయి . ఆదివారం 24139 టెస్టులు చేయడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 51,58,474 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.54 శాతంగా మరియు రికవరీ రేటు 95.20 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
కరోనాతో గాంధీ మునిమనవడు మృతి