
చెన్నై : ప్రొ కబడ్డీ లీగ్లో వరుసగా ఐదు ఓటముల తర్వాత తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 37–36తో హర్యానా స్టీలర్స్పై ఉత్కంఠ విజయం సాధించి లీగ్లో ఖాతా తెరించింది. కెప్టెన్ పవన్ సెహ్రావత్ (10 పాయింట్లు) మరోసారి సూపర్10 సాధించగా.. డిఫెండర్లు అజిత్ పవార్ (7), సందీప్ ధుల్ (5) ఆకట్టుకున్నారు. హర్యానా టీమ్లో శివం పతారె (12), వినయ్ (9) రాణించారు. మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 46–33తో తమిళ్ తలైవాస్ను ఓడించింది. శనివారం జరిగే మ్యాచ్ల్లో తలైవాస్తో జైపూర్, గుజరాత్ జెయింట్స్తో యూపీ యోధాస్ పోటీ పడతాయి.