దేశ రాజధానిలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు

దేశ రాజధానిలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు

ఢిల్లీ  : కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తోంది.  దేశ రాజధాని ఢిల్లీలో నిత్యం కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా 10 మంది ఒమిక్రాన్ బారిన పడినట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ప్రకటించారు. తాజాగా నమోదైన వాటితో కలుపుకొని ఢిల్లీలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 20కి చేరింది. వైరస్ బారిన పడిన వారికి ఎల్ఎన్జే హాస్పిటల్ లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇప్పటి వరకు వైరస్ సోకిన 20 మందిలో 10 మందిని డిశ్చార్జ్ చేసినట్లు సత్యేంద్ర జైన్ చెప్పారు.