సీఎం వచ్చే వరకు డెడ్‌బాడీ కదలదు

సీఎం వచ్చే వరకు డెడ్‌బాడీ కదలదు

రేప్ బాధితురాలి శవాన్ని మోసుకెళ్లిన పోలీసులు

ఉన్నావ్ ఘటనలో మృతిచెందిన బాధితురాలి అంత్యక్రియల్లో అలజడి రేగింది. సీఎం యోగి ఆదిత్యానాథ్ వచ్చే వరకు శవాన్ని తీయమంటూ బాధితురాలి కుటుంబసభ్యులు భీష్మించుకు కూర్చున్నారు. దాంతో పోలీసులే శవాన్ని శ్మశానవాటికకు మోసుకెళ్లారు. తమ కుటుంబానికి సీఎం యోగి న్యాయం చేయాలంటూ బాధితురాలి చెల్లెలు డిమాండ్ చేశారు. సీఎం వచ్చి మాట ఇచ్చే వరకు మృతదేహాన్ని తరలించిలేదంటూ ఆమె నిరసన వ్యక్తం చేసింది. లక్నో నుంచి వచ్చిన ప్రభుత్వ అధికారులు కుటుంబసభ్యులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ప్రధానమంత్రి ఆవాస యోజన కింద రెండు ఇళ్లులు మంజూరు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అయినా కూడా శాంతించని కుటుంబసభ్యులు సీఎం ఆదిత్యానాథ్ వచ్చే వరకు శవాన్ని తీసేది లేదని చెప్పారు. దాంతో పోలీసులు స్థానికుల సహాయంతో శవాన్ని అక్కడి నుంచి శ్మశానానికి తీసుకువెళ్లారు.