మే నెల‌లోనే టెన్త్ ఎగ్జామ్స్ పూర్తి చేస్తం

మే నెల‌లోనే టెన్త్ ఎగ్జామ్స్ పూర్తి చేస్తం

హై కోర్టు నిబంధనల ప్రకారం 10 వతరగతి పరీక్షలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. మంగ‌ళ‌వారం తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. భౌతికదూరం పాటిస్తూ, హాళ్లను శానిటైజ్‌ చేస్తూ..  అన్ని జాగ్రత్తలు పాటిస్తూ టెన్త్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ నెలలోనే టెన్త్‌ పరీక్షలు పూర్తి చేస్తామని తెలిపారు. ఒక హాల్లో 10 నుండి 15 మంది విద్యార్థులతో ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు . వారి కోసం ప్ర‌త్యేకంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు సీఎం . ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్ రేప‌టి నుండి (బుధవారం) ప్రారంభ‌మ‌వుతాయ‌ని ఆయ‌న అన్నారు