బైకులపై వచ్చి టెర్రర్ అటాక్.. 71 మంది సైనికులు మృతి

బైకులపై వచ్చి టెర్రర్ అటాక్.. 71 మంది సైనికులు మృతి

మాలి సరిహద్దులో ఉన్న నైజర్ మిలటరీ క్యాంపుపై ఐస్ఐస్ మిలిటెంట్లు దాడి చేశారు. ఈ దాడిలో నైజర్‌కు చెందిన సైనికులు దాదాపు 71 మంది చనిపోయినట్లు మరో 12 మంది గాయపడినట్లు నైజర్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వందలమంది మిలిటెంట్లు ఒక్కసారిగా బైకులు, ట్రక్కులలో వచ్చి మిలటరీ క్యాంపుపై దాడి చేశారు. ఈ దాడికి తమదే బాధ్యత అని ఐస్ఐస్ ప్రకటించుకుంది. నైజర్ అధ్యక్షుడి ఈజిప్టు పర్యటనకు వ్యతిరేకంగా ఈ దాడి జరిగిందని ఉన్నతాధికారులు అంటున్నారు.