జమ్ము కశ్మీర్లో మరోసారి ముష్కర మూకలు తెగబడ్డాయి. ఉత్తర కశ్మీర్లోని బందిపొరా జిల్లా గుల్షన్ చౌక్లో విధులు నిర్వహిస్తున్న పోలీసుల టీమ్పై ఉన్నట్టుండి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను మహ్మద్ సుల్తాన్, ఫయాజ్ అహ్మద్గా గుర్తించామని జమ్ము కశ్మీర్ పోలీసులు తెలిపారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ముష్కరులను పట్టుకునేందుకు ఆ ఏరియాను జల్లెడ పడుతున్నట్లు చెప్పారు. ఆ పరిసరాల్లో కార్డన్ సెర్చ్ నడుస్తోందని అన్నారు.
#Terrorists fired upon a police party at Gulshan Chowk area of #Bandipora. In this #terror incident, 02 police personnel namely SgCT Mohd Sultan & Ct Fayaz Ahmad got injured & attained #martyrdom. Area cordoned off. Further details shall follow. @JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) December 10, 2021
ముష్కర దాడిని ఖండించిన సీఎం ఒమర్ అబ్దుల్లా
బందిపొరాలో జరిగిన ఈ ఉగ్రదాడిని కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. ఈ ఘటనలో మరణించిన ఇద్దరు పోలీసులు మహ్మద్ సుల్తాన్, ఫయాజ్ అహ్మద్లకు అల్లా స్వర్గ ప్రాప్తి కల్పించాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన.. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని అన్నారు.