బొల్లారంలోని ఫ్యాక్టరీలో భారీ పేలుడు

బొల్లారంలోని ఫ్యాక్టరీలో భారీ పేలుడు

సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని ఓ ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. వింధ్యా ఆర్గానిక్స్ పరిశ్రమలో ఈ పేలుడు జరిగింది. ఫ్యాక్టరీలో కార్మికులున్న సమయంలోనే పేలుళ్లు జరిగాయి. దీంతో వారంతా అందులోనే చిక్కుకుపోయారు. కొందరు మాత్రం బయటకు వచ్చారు. కార్మికులకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. వారిని సమీప హాస్పిటల్స్ కు తరలిస్తున్నారు

ప్రమాద స్థలంలో కార్మికులు ఎక్కడికక్కడే పడిపోయారు. మరికొంత మంది ఫ్యాక్టరీలోనే చిక్కుకున్నట్టు తెలుస్తోంది. దట్టమైన పొగలు వ్యాపించడంతో సహాయక చర్యలకు ఇబ్బంది అవుతోంది. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. విధ్య ఆర్గానిక్స్ చుట్టుపక్కన ఉన్న ఫ్యాక్టరీలను పోలీసులు షట్ డౌన్ చేయిస్తున్నారు. కంపెనీ పరిసరాల్లో ఘాటైన వాసన వ్యాపించటంతో.. సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.