డివైడర్​ను ఢీకొట్టిన కారు.. ఒకరి మృతి.. నలుగురికి తీవ్ర గాయాలు

డివైడర్​ను ఢీకొట్టిన కారు.. ఒకరి మృతి.. నలుగురికి తీవ్ర గాయాలు
  •     రంగారెడ్డి జిల్లా మైలార్​దేవ్ పల్లి పీఎస్ పరిధిలో ఘటన

శంషాబాద్, వెలుగు :  కారు అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టడంతో ఒకరు చనిపోగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన  మైలార్ దేవ్ పల్లి పీఎస్ పరిధిలో జరిగింది. ఇన్​స్పెక్టర్ మధు తెలిపిన వివరాల ప్రకారం.. డబీర్ పురాకు చెందిన సయ్యద్ అబ్దుల్ వహీల్(56), అతడి బంధువులు ఒమెర్ నిహాల్(26), సయ్యద్ మహ్మద్ రహుద్దీన్, షోయబ్, సయ్యద్ అబ్దుల్ రెహమాన్​తో కలిసి ఆదివారం రాత్రి కాటేదాన్​లోని ఓ ఫంక్షన్​కు కారులో వెళ్లారు. అర్ధరాత్రి 1 గంటకు తిరిగి ఇంటికి బయలుదేరారు. కారును అబ్దుల్ వహీల్ డ్రైవ్ చేస్తున్నాడు.  

అర్ధరాత్రి దాటాక 2 గంటలకు కాటేదాన్ లోని శివసాయి కాంటా వద్ద కుక్క అడ్డురావడంతో అబ్దుల్ వహీల్ సడెన్ బ్రేక్ వేశాడు.  ఓవర్ స్పీడ్ కారణంగా కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఒమెర్ నిహాల్ అక్కడికక్కడే మృతిచెందాడు. మిగతా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మైలార్ దేవ్ పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని దగ్గరలోని హాస్పిటల్ కు తరలించారు. నిహాల్ డెడ్ బాడీని ఉస్మానియాకు తరలించారు. కేసు ఫైల్ చేశారు.