పంచాయతీ ఆఫీసుకి గులాబీ రంగు

పంచాయతీ ఆఫీసుకి గులాబీ రంగు

బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా దేవాపూర్ గ్రామ పంచాయతీ ఆఫీస్​కు ఈ మధ్య కొత్తగా రంగులేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీ జెండా కలర్​ను ఆఫీసుకు కొట్టడం వివాదానికి దారి తీసింది. ప్రభుత్వ కార్యాలయానికి గులాబీ కలర్ ఎలా వేస్తారని స్థానికులు, ఇతర పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. వెంటనే గ్రామ పంచాయతీ కలర్​ను మార్చాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.

దీనిపై జిల్లా ఆఫీసర్లు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో పక్క రాష్ర్టం ఆంధ్రప్రదేశ్​లో అన్న క్యాంటీన్లకు టీడీపీ రంగులు వేయడం.. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఆఫీసులకు తమ జెండా కలర్ వేయడం వివాదాలకు దారితీసింది.

see also: పిల్లి కాదు.. పులి

మరిన్ని వార్తల కోసం