విదేశాల నుంచి వచ్చేటోళ్లు కరోనా రిపోర్టు చూపాల్సిందే

విదేశాల నుంచి వచ్చేటోళ్లు కరోనా రిపోర్టు చూపాల్సిందే

హైదరాబాద్, వెలుగు: వందే భారత్ మిషన్ ద్వారా విదేశాల నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చే ప్యాసింజర్లు తప్పనిసరిగా నాలుగు రోజుల ముందే కరోనా టెస్టుచేయించుకుని, సర్టిఫికెట్ తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. విదేశాల నుంచి వచ్చేవారు అక్కడ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసుకోవాలని, ఆ సర్టిఫికెట్ ను ఇక్కడ తప్పని సరిగా చూపించాలని రూల్ పెట్టింది. టెస్టులో నెగెటివ్ వచ్చినట్లు సర్ఫిటి కెట్ ఉన్నవారు క్వా రంటైన్ లేకుండా నేరుగా ఇంటికి వెళ్ళి పోవచ్చని  అధికారులు శుక్రవారం వెల్లడించారు. సర్ఫిటి కెట్ లేకుండా ఎయిర్ పోర్టుకు వచ్చే ప్యాసింజర్లకు 7 రోజుల హోటల్ క్వారంటైన్, 7 రోజుల హోమ్ క్వారంటైన్ తప్పనిసరి చేసిన ట్లుతెలిపారు. ప్రెగ్నెంట్లు, చిన్న పిల్ల కు సర్టి ఫికెట్ లేకపోయినా క్వారంటైన్ ఉండదన్నా రు. బిజినెస్ పని మీద వచ్చేవారు కూడా సర్ఫిటి కెట్ తెచ్చుకోవాలని, అయితే, వారు తిరిగి నాలుగు రోజుల్లో వెళ్ళి పోయేందుకు  రిటర్న్ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని ఉంటే.. వారికి కూడా క్వారంటై న్ ఉండదని పేర్కొన్నారు.