కరోనా టీకాలతో భారత్లో 42 లక్షల ప్రాణాలు దక్కినయ్

కరోనా టీకాలతో భారత్లో 42 లక్షల ప్రాణాలు దక్కినయ్
  • టీకాలతో  వరల్డ్ వైడ్గా 2 కోట్ల మంది బతికిన్రు    
  • లండన్ కాలేజ్ స్టడీలో వెల్లడి    

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ ల వల్ల  మన దేశంలో 2021లోనే 42 లక్షల మరణాలు తగ్గాయని బ్రిటన్​కు చెందిన ఇంపీరియల్​ కాలేజ్​ లండన్​ అధ్యయనంలో వెల్లడైంది. దీనికి సంబంధించిన నివేదిక లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్‌‌లో పబ్లిష్​అయ్యింది. కరోనా టైంలో ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్​ 8, 2020 నుంచి డిసెంబర్​8, 2021 మధ్య మరణాలపై నిపుణులు స్టడీ చేశారు. అధికారిక లెక్కల ప్రకారం.. మన దేశంలో 5,24,941 మంది కరోనాతో చనిపోయారు. వాస్తవానికి ఈ సంఖ్య 10 రెట్లు అధికంగా ఉండేదని స్టడీలో వెల్లడైంది. ఇండియాలో వ్యాక్సిన్​ రాకపోయి ఉంటే 2021లోనే 27 లక్షల నుంచి 53 లక్షల మంది చనిపోయేవారని స్టడీ లీడ్ ఆథర్  ఒలివెర్​ వాట్సన్​ వివరించారు.  

ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల డెత్స్ తగ్గినయ్ 
వరల్డ్ వైడ్​గా 2021లో 3.14 కోట్లకు పైగా జనాలు చనిపోయేవారని వాట్సన్​ పేర్కొన్నారు. వ్యాక్సిన్​ రాకతో 2 కోట్ల మరణాలు తగ్గాయని తెలిపారు.  185 దేశాల్లో అప్పటికే వ్యాక్సినేషన్​ ప్రారంభమైందన్నారు. 2021 చివరి నాటికి రెండు లేదా అంతకంటే ఎక్కువ డోసులు.. ప్రతి దేశంలోని 40 శాతం జనాభాకు వేయాలన్న డబ్ల్యూహెచ్ఓ లక్ష్యం నెరవేరి ఉంటే.. మరో 5,99,300 ప్రాణాలు దక్కేవన్నారు. అయితే, ఇందులో చైనాను లెక్కలోకి తీసుకోలేదన్నారు.దేశంలో 17 వేలకుపైగా డైలీ కేసులు 
మనదేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఒకే రోజు 17 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 4 నెలల్లో అత్యధికంగా శుక్రవారం 17,336 మంది వైరస్ బారిన పడినట్లు కేంద్రం వెల్లడించింది. అంతకుముందు రోజు 13 వేల పైచిలుకు మందికి వైరస్ సోకితే.. ఒక్కరోజులోనే కొత్త కేసుల సంఖ్య 4,294 కు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ కేసుల్లో ఏకంగా 30% పెరుగుదల నమోదైంది. యాక్టివ్ కేసుల సంఖ్య 88,284కు పెరిగింది. వైరస్ బారిన పడి గడిచిన 24 గంటల్లో 13 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 4,33,62,294కి, మొత్తం మరణాల సంఖ్య 5,24,954 కి చేరుకుంది.