అక్బరుద్దీన్పై నమోదైన కేసుల కొట్టివేత

అక్బరుద్దీన్పై నమోదైన కేసుల కొట్టివేత
  • అన్ని కేసుల్లో అక్బరుద్దీన్ ఒవైసీ నిర్దోషి
  • విద్వేష పూరిత ప్రసంగం మళ్లీ చేయరాదు 
  • కేసులు కొట్టేసినంత మాత్రాన సంబరాలు చేస్కోవద్దు: ప్రజాప్రతినిధుల కోర్టు

హైదరాబాద్: హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యల కేసులను ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టేసింది. రెండు కేసుల్లో అక్బరుద్దీన్ ఒవైసీ నిర్దోషి అని తేల్చింది కోర్టు. అయితే విద్వేష పూరిత ప్రసంగం మళ్లీ చేయరాదని హెచ్చరించింది. కేసులు కొట్టేసినంత మాత్రాన సంబరాలు చేస్కోవద్దని కోర్టు స్పష్టం చేసింది. సుమారు 10 సంవత్సరాల క్రితం నమోదైన ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన  నాంపల్లి కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. ఎలాంటి ఆధారాలు పోలీసులు సమర్పించకపోవడం వల్లే కోర్టు కేసును కొట్టేసిందని అక్బరుద్దీన్ తరపు న్యాయవాది తెలిపారు. 
అయితే సుదీర్ఘ విచారణలో 38 మంది సాక్షులను విచారించిన కోర్టు ఎస్ఎఫ్ఎల్ రిపోర్టు ను సైతం పరిశీలించినట్లు తెలుస్తోంది. నిజామాబాద్, నిర్మల్ జిల్లాలో పదేళ్ల కింద అక్బరుద్దీన్ చేసిన కామెంట్స్ పై తీవ్ర దుమారం రేగింది. ఈ ప్రసంగం విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందంటూ పోలీసులు ఐపీసీ 120 బీ, 153 ఏ, 295, 188 సెక్షన్ల కింద సుమోటోగా కేసులు నమోదు చేశారు. ఈ కేసులో 2013 జనవరి 8న అరెస్టయిన అక్బరుద్దీన్ 40 రోజుల పాటు జైల్లో ఉన్నారు. 
ఈ రెండు కేసులకు సంబంధించి నిర్మల్ లో మొదటగా నమోదైన ఎఫ్ఐఆర్ ను మాత్రమే ప్రధాన కేసుగా భావించి నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కోర్టులో విచారణ పదేళ్లపాటు సుదీర్ఘంగా విచారణ జరిగింది. 
కోర్టు తీర్పుతో ఊరట
అక్బరుద్దీన్ ఒవైసీపై నమోదైన విద్వేష వ్యాఖ్యల కేసులను నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టేయడం ఊరట కలిగించింది. పాతబస్తీలో నిన్నటి నుంచే పోలీసులు భారీ సంఖ్యలో మొహరించడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ఏర్పడింది. ఎలాంటి పరిణామాలు ఏర్పడినా ఎదుర్కొనేలా పోలీసులు చేసిన హడావుడి ఉత్కంఠ రేపింది. ముఖ్యంగా చార్మినార్, మక్కా మసీద్, చాంద్రాయణ గుట్ట వద్ద పరిస్థితిని పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో ఏం జరగబోతోందోనన్న ఉత్కంఠ పరిస్థితి ఏర్పడింది. అయితే కోర్టు తీర్పు ఎలా వచ్చినా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాతబస్తీలో ప్రశాంతంగా ఉంది. కేసులను కొట్టేస్తూ తీర్పు రావడంతో ఉత్కంఠకు తెరపడింది. 

 

 

ఇవి కూడా చదవండి

కేసీఆర్ చేసిన తప్పుకు రైతులు బలయ్యారు

కేసీఆర్ అరెస్ట్ కావడం ఖాయం

ప్రభుత్వంపై సీబీఐ ఎంక్వైరీ వేయాలి

ప్రభుత్వ తీరుపై గవర్నర్కు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు