రాష్ట్రవ్యాప్తంగా పోడు రైతుల గోస

రాష్ట్రవ్యాప్తంగా  పోడు రైతుల గోస
  • ఆదివాసీలకు అడుగడుగునా అడ్డుపడుతున్న అటవీ అధికారులు
  • ఆదివాసీలు - అటవీ అధికారుల మధ్య తరచూ గొడవలు

హైదరాబాద్: రాష్ట్రంలో పోడు రైతుల గోస కొనసాగుతోంది. పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలిస్తామన్న సర్కార్ పట్టించుకోకపోవడంతో.. ఆదివాసీలు, ఫారెస్ట్ ఆపీసర్ల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. మంచిర్యాల జిల్లాదండేపల్లి మండలం కోయపోషగూడెంలో ఏకంగా 12మంది మహిళలను గత నెలలో జైలుకు పంపారు ఫారెస్ట్ అదికారులు. మరోసారి కోయపోషగూడెంలో ఉద్రిక్తత ఏర్పడింది. పోడుభూముల్లో ఆదివాసీసులు వేసుకున్న గుడిసెలను అటవీశాఖ అధికారులు తొలగించారు. గిరిజనులు కాళ్లపై పడి వేడుకున్నా పట్టించుకోకుండా గుడిసెలను బలవంతంగా పీకేశారు. దీంతో అధికారులు-గిరిజనులకు మధ్య గొడవ జరిగింది. తమ భూముల్లోనే గుడిసెలు వేసుకున్నా బలవంతంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు గిరిజనులు.

మహిళలను నెట్టేసి.. తానే చొక్కా చింపుకుని గిరిజనులపై ఫిర్యాదు చేసిన ఫారెస్ట్ ఆఫీసర్

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్ లో పోడు రైతులు, బీట్ అధికారి చందర్ రావుకు మధ్య గొడవ జరిగింది. పోడు భూముల్లో సాగు చేయొద్దంటూ పోడు రైతుల్ని అడ్డుకున్నారు బీట్ ఆఫీసర్. దీంతో మహిళలకు, ఆఫీసర్ కు మధ్య గొడవ జరిగింది. అయితే మహిళలను కూడా అధికారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అడ్డుకుంటున్న మహిళలను నెట్టిటేసి.... తానే చొక్కా చించుకుని గిరిజనులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఫారెస్ట్ ఆఫీసర్ చందర్ రావు. 

పట్టాభూములను ఇవ్వాలంటూ జోరువానలోను భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలో గిరిజనులు దీక్ష కొనసాగిస్తున్నారు. చీకటిలో, టెంట్లపై నుంచి చినుకులు పడ్తున్నా లెక్క చేయకుండా దీక్షా చేశారు. భూములు ఇచ్చేంత వరకు దీక్ష విరమించేది లేదంటున్నారు. రామన్నగూడెంలోని సర్వే నంబర్ 30, 36, 39లలో తమ భూములు ఉన్నాయంటున్నారు గిరిజనులు. పట్టాలున్నా అధికారులు భూమి గుంజుకున్నారని చెబెతున్నారు. భూములు అప్పగించాలంటూ కొన్ని రోజులుగా పోరాటం చేస్తుంటే..భూములపై జాయింట్ సర్వే చేయాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారన్నారు. అధికారులు మాత్రం సర్వే చేయకుండా తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గిరిజనులు. ఫారెస్ట్ టేకు ప్లాంటేషన్ లో టెంట్ వేసి నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నారు. రాత్రి వర్షం పడ్తున్నా దీక్ష కొనసాగించారు గిరిజనులు.

ఫారెస్ట్ ఆఫీసర్ కాళ్లపై పడి వేడుకున్న గిరిజన మహిళ

నల్గొండ జిల్లా సాగర్ నియోజకవర్గం సుంకిశాల తండాలో పోడు భూముల్లో మొక్కలు నాటారు ఫారెస్ట్ అధికారులు. 50ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిలో మొక్కలను నాటొద్దంటూ అడ్డుకున్నారు గిరిజనులు. ఫారెస్ట్ అధికారిపై కాళ్లపై పడి మరీ తమ భూమిలో మొక్కలు నాటొద్దని వేడుకున్నారు ఓ గిరిజన మహిళ.
50ఏళ్ల నుండి సాగు చేసుకుంటుంటే.. పార్కు పేరుతో లాక్కున్నారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో దాదాపు 40ఎకరాల పోడు భూములను స్వాధీనం చేసుకున్నారు ఫారెస్ట్ అధికారులు. చూట్టు ట్రెంచ్ నిర్మించి భూముల్లో మొక్కలు నాటడంతో అడ్డుకున్నారు పోడు రైతులు. 50 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటుంటే ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు పార్కుల పేరుతో లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.