భార్యాబిడ్డల్ని ఇంట్లోంచి గెంటేసిన భర్త.. చెప్పులతో దేహశుద్ధి చేసిన స్థానిక మహిళలు

భార్యాబిడ్డల్ని ఇంట్లోంచి గెంటేసిన భర్త.. చెప్పులతో దేహశుద్ధి చేసిన స్థానిక మహిళలు

నిజామాబాద్‌ క్రైం,వెలుగు: భార్యాబిడ్డలను ఇంట్లోంచి గెంటేసిన వ్యక్తికి స్థానిక మహిళలు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగింది. బాధితురాలి వివరాల ప్రకారం.. విద్యుత్ నగర్ లో నివాసముండే కృష్ణ, హారిక దంపతులకు నలుగురు సంతానం. హారిక చెల్లిని ఆమె భర్త కృష్ణ నాలుగేండ్ల కింద బలవంతంగా పెండ్లి చేసుకున్నాడని, ఇప్పుడు ఆమెను ఇంటికి తీసుకురావాలంటూ తనను వేధిస్తున్నాడని బాధితురాలు గోడు వెల్లబోసుకుంది. తన చెల్లిని తీసుకువస్తేనే ఇంట్లో ఉండనిస్తానంటూ మంగళవారం పిల్లల్ని తనను వెళ్లగొట్టాడని చెప్పింది. మహిళా సంఘాలను ఆశ్రయించడంతో వాళ్లు ఇంటికి వచ్చి కృష్ణను చెప్పులతో కొట్టి అతని ఇంటిముందే బాధితురాలితో కలిసి బైఠాయించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.