రేడియో, జీపీఎస్, శాటిలైట్ కమ్యూనికేషన్లకు అంతరాయం
ఇండియా, సౌత్ ఈస్ట్, ఆసియా మీద ఎఫెక్ట్
న్యూఢిల్లీ: సూరీడు నిప్పులు కక్కిండు.. అలాంటి ఇలాంటి నిప్పులు కావవి. శాటిలైట్ కమ్యూనికేషన్స్ను, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్)కు తీవ్రమైన ఆటంకం కలిగించే నిప్పులవి. బుధవారం ఉదయం 9.27 గంటలకు ఎక్స్2.2 క్లాస్కు చెందిన అగ్ని వలయాన్ని సూర్యుడు చిందించాడని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ స్పేస్ సైన్సెస్ ఇండియాసెసీ) సైంటిస్టులు వెల్లడించారు. ఈ అగ్ని వలయం సూర్యుడిపై ఉండే ఏఆర్12992 అనే ప్రాంతం నుంచి వెలువడ్డాయని సెసీ అసోసియేట్ ప్రొఫెసర్, కోఆర్డినేటర్ దిబ్యేందు నంది చెప్పారు. ప్రస్తుతం ఇండియా, సౌత్ ఈస్ట్ ఆసియా, ఆసియా పసిఫిక్ రీజియన్ మీద దీని ప్రభావం ఉందని పేర్కొన్నారు. సోలార్ ఫ్లేర్స్లో ఎక్స్క్లాస్ అత్యంత శక్తిమంతమైనదన్నారు. దీనివల్ల కమ్యూనికేషన్స్లో అంతరాయం ఏర్పడుతుందని, శాటిలైట్, జీపీఎస్ల పనితీరులో లోపాలొస్తాయని పేర్కొన్నారు. ఒక్కోసారి స్పేస్క్రాఫ్ట్లపైనా ప్రభావం ఉంటుందని, వచ్చిపోయే ఆస్ట్రోనాట్లకు ముప్పు ఏర్పడే అవకాశాలున్నాయని చెప్పారు. వాటితో పాటు రేడియో సిగ్నల్స్, పవర్ గ్రిడ్స్, నావిగేషన్ సిగ్నల్స్ మీదా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందన్నారు.