ఎంబీసీల బతుకులు ఆగమైనయ్

ఎంబీసీల బతుకులు ఆగమైనయ్

హైదరాబాద్ : కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో ఎంబీసీల బతుకులు ఆగమయ్యాయని అన్నారు.. OBC మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్. ప్రస్తుత పరిస్థితులు పెనం నుంచి పొయ్యిలో పడినట్లు తయారయ్యాయన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీస్ లో.. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో.. ఎంబీసీ కులాల సదస్సు జరిగింది. OBC మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, OBC మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్ రాజ్, ఎంబీసీ కులాల నేతలు హాజరయ్యారు. తెలంగాణా రాష్ట్రం వస్తే చిన్న కులాలకు న్యాయం జరుగుతుందని అనుకున్నాం కానీ న్యాయం జరగలేదన్నారు. చిన్న కులాలంటే కేసీఆర్ కు చిన్నచూపని విమర్శించారు. కేంద్రంలో మోడీ చిన్న కులాలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తుంటే.. కేసీఆర్ మాత్రం చిన్న కులాలను వాడుకుంటున్నారని మండిపడ్డారు లక్ష్మణ్.