
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా వైరస్ బారినపడ్డ వారిలో పెద్ద సంఖ్యలో చిన్న పిల్లలూ ఉంటున్నారు. ఫంక్షన్లు, హాస్పిటళ్లకు వెళ్లడంతో కొందరికి.. ఎటూ వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నా బయటికెళ్లొచ్చిన పెద్దల నుంచి మరికొందరికి వైరస్ సోకుతోంది. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు వారిని దగ్గరికి తీసుకోవడమే సమస్యగా మారుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,256 మందికి కరోనా పాజిటివ్రాగా.. అందులో 300 మందికిపైగా 15 ఏళ్లలోపు పిల్లలే. ఈ నెల 18న హెల్త్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన బులెటిన్ ప్రకారమే డిశ్చార్జయిన వారిలో పదేళ్లలోపు పిల్లలు 85 మంది, 11 నుంచి 15 ఏళ్లలోపువాళ్లు 75 మంది ఉన్నారు. మరో 140 మంది ట్రీట్మెంట్పొందుతున్నట్టు తెలిసింది.
ఐదుగురు చిన్నారులు కన్నుమూశారు
రాష్ట్రంలో ఐదుగురు చిన్నారులను కరోనా బలిగొంది. నారాయణపేట జిల్లా రెనిపట్లకు చెందిన 2 నెలల బాబుకు ఏప్రిల్ 17న కరోనా నిర్ధారణకాగా.. రెండు రోజులకే గాంధీ హాస్పిటల్లో కన్నుమూశాడు. హైదరాబాద్ లోనిఆసిఫ్నగర్ కు చెందిన 11 నెలల బాలుడు ఏప్రిల్ 19న చనిపోయాడు. అనుమానంతో టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్లోని దావూద్ బస్తీలో 10 రోజుల పాప ఈ నెల 26న, సూర్యాపేట సమీపంలోని కాసరబాదకు చెందిన 4 నెలల బాబు 27న మృతిచెందారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో ఉండే బీహార్ వలస కూలీ ఈ నెల 18న నీలోఫర్ హాస్పిటల్లో చిన్నారికి జన్మనివ్వగా.. పుట్టిన ఎనిమిదో రోజే ఆ పసికందు కరోనాతో చనిపోయింది.