ఉప్పును చోరీ చేసిన దొంగలు.. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు

ఉప్పును చోరీ చేసిన దొంగలు.. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు

ఉప్పల్, వెలుగు: దొంగలంటే.. బంగారం, వెండి, డబ్బు, ఇతర విలువైన వస్తువులు ఎత్తుకెళ్తుంటారు. ఉప్పల్ లో మాత్రం దొంగలు ఉప్పును చోరీ చేశారు. ఓ జంట బుధవారం రాత్రివేళ బైక్ పై వచ్చి ఓ కిరాణ షాపు ముందు ఆగారు.

7 ఉప్పు బస్తాలను స్కూటీపై వేసుకుని వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే.. స్కూటీపై ఉన్న యువకుడికి.. అమ్మాయే స్వయంగా ఉప్పు బస్తాలు అందించడం గమనార్హం.