సమ్మర్ టూర్ వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల

సమ్మర్ టూర్ వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగల ముఠా భారీ చోరీ పాల్పడింది. హైదరాబాద్ శివారు అల్కపూర్ టౌన్ షిప్ లో నివాసం ఉండే ఓ వ్యాపారి ఇల్లు గుళ్ల చేశారు. ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 30 తులాల బంగారం, రెండు కేజీల వెండితో పాటు వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. సదరు వ్యాపారి కుటుంబంతో పాటు సమ్మర్ టూర్ కు వెళ్లాడు. విహార యాత్ర ముగించుకొని ఇంటికి వచ్చేసరికి తాళం తీసి ఉండాన్ని గమనించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా గందరగోళంగా ఉంది. 

దీంతో తన ఇంట్లో దొంగలు పడ్డారని తెలుసుకున్నారు. బాధితుడు వెంటనే నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు పోయినట్లు బాధితుడు పోలీసులకు వివరించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.