శంకర్పల్లి, వెలుగు: బీజేపీ రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధిగా చేవెళ్ల సెగ్మెంట్ నాయకుడు తొండ రవి నియామకమయ్యారు. ఈ మేరకు సోమవారం ఆయనకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహా రెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా తొండ రవి మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో శంకర్ పల్లి మున్సిపల్ అధ్యక్షుడు సురేశ్ పాల్గొన్నారు.