నిజాం మ్యూజియంలో టిఫిన్ బాక్సు చోరీ.. నిందితుడికి జీవిత ఖైదు

నిజాం మ్యూజియంలో టిఫిన్ బాక్సు చోరీ.. నిందితుడికి జీవిత ఖైదు

హైదరాబాద్: ప్రముఖ నిజాం మ్యూజియంలో టిఫిన్ బాక్సు చోరీ కేసులో రంగారెడ్డి కోర్టు జిల్లా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడికి కోర్టు జీవిత ఖైదు విధించింది. కాగా, 2018లో నిజాం మ్యూజియంలో విలువైన వజ్రాలు పొదిగిన బంగారు టిఫిన్ బాక్స్ చోరీ కేసులో గౌస్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో బెయిల్ మీద జైలు నుంచి విడుదలైన గౌస్.. తర్వాత మళ్లీ నేరాలు చేయడం ప్రారంభించాడు. 

ఈ క్రమంలోనే 2023లో రాజేంద్ర నగర్ పరిధిలో సవర్ ఖాన్ అనే వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశాడు గౌస్. ఈ కేసులో రాజేంద్ర నగర్ పోలీసులు గౌస్‎ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని సాక్ష్యాలను రాజేంద్ర నగర్ పోలీసులు కోర్టుకు సమర్పించారు. విచారణ అనంతరం నిందితుడు గౌస్ కు రంగారెడ్డి జిల్లా కోర్టు జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది.