
హైదరాబాద్: టీమిండియా బ్యాటర్ తిలక్ వర్మ కౌంటీ క్రికెట్ ఆడనున్నాడు. ఈ మేరకు హాంప్షైర్ ప్రతినిధులు తమను సంప్రదించారని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) బుధవారం తెలిపింది. ‘హైదరాబాద్ ఇంటర్నేషనల్ ప్లేయర్ ఎన్. ఠాకూర్ తిలక్ వర్మ యూకే కౌంటీల్లో బరిలోకి దిగనున్నాడు. హాంప్షైర్తో అతని ప్రయాణం సాఫీగా సాగాలని కోరుకుంటున్నాం. ఈ కౌంటీ తరఫున తిలక్ అత్యుత్తమంగా రాణిస్తాడని నమ్ముతున్నాం’ అని హెచ్సీఏ బుధవారం పేర్కొంది. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ఆడుతున్న 22 ఏళ్ల తిలక్.. టీమిండియా తరఫున 25 టీ20ల్లో 749, 4 వన్డేల్లో 68 రన్స్ చేశాడు. ఇక కెరీర్లో 18 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన తిలక్ 50.16 సగటుతో 1204 రన్స్ సాధించాడు. ఇందులో ఐదు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.