మోడీని కలిసిన తిరుమల, శ్రీశైలం అర్చకులు

మోడీని కలిసిన తిరుమల, శ్రీశైలం అర్చకులు

న్యూ ఇయర్ సందర్భంగా ప్రఖ్యాత తిరుమల తిరుపతి, శ్రీశైలం దేవస్థానాల అర్చకులు ఢిల్లీ వెళ్లి  ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. మోడీకి వేదాశీర్వచనం ఇచ్చారు. శేష వస్త్రాలతో పాటు ఆలయాల నుంచి తెచ్చిన ప్రసాదాలను అందించారు. మోడీ చేతికి కంకణాలు కట్టారు. మోడీ అర్చకులతో కాసేపు మాట్లాడారు.