టాలీవుడ్లో విషాదం

టాలీవుడ్లో విషాదం

టాలీవుడ్ సీనియర్ నటుడు విద్యాసాగర్ రాజు అనారోగ్యంతో ఇవాళ మృతి చెందారు. గత కొన్నాళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. విద్యాసాగర్ రాజు వయసు 73 ఏళ్లు కాగా.. మాయలోడు, రాజేంద్రుడు - గజేంద్రుడు, అహ నా పెళ్లంట, స్వాతిముత్యం, ఆఖరి క్షణం వంటి హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. 

విద్యాసాగర్ రాజు తన కెరీర్ లో 100కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన తొలుత నాటకాలతో మెప్పించారు. ఆపై సినీ రంగంలో ప్రవేశించి అన్ని తరహా పాత్రలు పోషించారు. 'ఈ చదువులు మాకొద్దు' అనే అభ్యుదయ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించారు. సీనియర్‌ నటి రత్నప్రభ విద్యాసాగర్‌ భార్య. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విద్యాసాగర్‌ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.