
- సర్కార్ లెక్క మొత్తం 99,391.. దాచిన కేసులు 71,657
- మరణాల్లోనూ ఇదే ధోరణి 1,500 మందికిపైగా చనిపోయారంటున్న ఆఫీసర్లు
- 737 మరణాలే చూపుతున్న సర్కార్
- లెక్కలు అన్నీ దాస్తూ.. వైరస్ కంట్రోల్ చేసినమని గొప్పలు
రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షకు చేరువైంది. కానీ, కరోనా కేసుల అసలు లెక్క 1,71,048 దాటింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 98,756 కేసులు నమోదవగా, జిల్లాల్లో 72,292 మందికి వైరస్ అంటుకుంది. ఇప్పటికీ వైరస్ వ్యాప్తి కొంచెం కూడా తగ్గ లేదు. జీహెచ్ఎంసీ పరిధిలో శుక్రవారం ఒక్కరోజే 1,734 కేసులు నమోదయ్యాయి. రోజూ ఇదే స్థాయిలో కేసులు వస్తున్నప్పటికీ, సర్కారు ఇందులో సగం కూడా బయటకు వెల్లడించడం లేదని జిల్లాల నుంచి అందిన లెక్కలు చెప్తున్నాయి. ఆరోగ్యశాఖ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 99,391 మాత్రమే. అసలు లెక్కకు, ఆరోగ్యశాఖ లెక్కకు 71,657 కేసుల తేడా ఉంది. మరణాల విషయంలోనూ ఇదే వైఖరిని అనుసరిస్తున్నారు . శ్మశానాల్లో రోజూ పదుల సంఖ్యలో కరోనా శవాలు కాలుతున్నయి. కానీ, సర్కార్ మాత్రం రోజూ పది కంటే తక్కువ మరణాలనే చూపిస్తోంది. కరోనా మరణాల సంఖ్య 15 వందలు ఎప్పుడో దాటిందని ఓ ఉన్నతాధికారి ఆఫ్ ది రికార్డులో చెప్పుకొచ్చారు. బులెటిన్లో మాత్రం 737 మరణాలు మాత్రమే నమోదైనట్టు చూపిస్తున్నారని అన్నారు.
మహారాష్ట్రకు మించిపాజిటివ్ రేట్
దేశంలో అత్యధిక కేసులు నమోదైన మహారాష్ట్ర కంటే, మన దగ్గరే పాజిటివ్ రేట్ ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో టెస్టులు చేసుకుంటున్న ప్రతి 100 మందిలో 19 మందికి పాజిటివ్ వస్తే, మన దగ్గ ర 20 మందికి పాజిటివ్ వస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో రంగారెడ్డిజిల్లాలో 33.23 శాతం, మేడ్చ ల్లో 26.5 శాతం పాజిటివ్ రేట్ నమోదవుతోంది.
కరోనా కంట్రోల్ ముచ్చటవట్టిదే?
ఈ నెల చివరి నాటికి గ్రేటర్లో, వచ్చే నెల ఆఖరు వరకూ రాష్ట్రంలో కరోనా పూర్తిగా కంట్రోల్ లోకి వస్తుందన్న లెక్కలు వట్టివేనని క్షేత్రస్థాయిలో పని చేస్తున్న డాక్టర్లు చెబుతున్నారు. అయితే, సర్కార్ మాత్రం వైరస్ ను కంట్రోల్ చేసినం అని చెప్పుకునేం దుకు వేలల్లో వస్తున్న కేసులను, వందల్లోకి తగ్గించి చూపిస్తోంది.