
ఉగ్రవాదులకు కూడా ఇలాంటి ఐడియాలు.. ఇంత హింస ఉండదేమో.. ఎందుకంటే రోజు రోజుకు దేశంలో పెళ్లాలు, అమ్మాయిల చేతిలో బలవుతున్న మొగుళ్లు, తండ్రులు, తల్లుల పరిస్థితి చూస్తుంటే ఇలాగే అనిపిస్తుంది. ఇష్టం లేనప్పుడు పెళ్లి చేసుకోవటం ఎందుకు.. ఆ తర్వాత మూడు ముళ్లు వేసినోడిని పరలోకానికి పంపించటం ఎందుకో ఎవరికీ అర్థం కావటం లేదు.. లేటెస్ట్ గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఘోరం వెలుగులోకి వచ్చిన తర్వాత.. దేశంలోని యువత అంతా ఔరా అని ముక్కున వేలేసుకుంటుంది. ఈ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అలీఘర్ లోని ఏడీఏ కాలనీకి చెందిన నిషాద్ అనే 26 ఏళ్ల యువకుడికి ఏప్రిల్ 29న సితార అనే యువతితో పెళ్లి జరిగింది. మే 2న ఘనంగా రిసెప్షన్ కూడా జరిగింది. కొత్తగా పెళ్లైన భార్యాభర్తలకు మధురమైన అనుభూతులను పంచే మూడు రాత్రుల ముచ్చట మాత్రం ఈ యువకుడికి భయంకరమైన పీడకలగా మిగిలిపోయింది. తనను ముట్టుకుంటే ఒప్పుకునేది లేదని, తన శరీరంలోని అణువణువూ అమన్ అనే అబ్బాయికి సొంతమని నవ వధువు చెప్పేసరికి వరుడికి దిమ్మతిరిగింది. ఆ మూడు రాత్రులు ఈ కొత్త జంట గదిలోకి వెళ్లి తలుపులేసుకోవడం, ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తానని సితార కత్తితో బెదిరించడం.. ఇదే జరిగింది.
తాను ఇంకొకరి సొంతమని తెగేసి చెప్పింది. మాస్ సినిమా హీరో విలన్కు వార్నింగ్ ఇచ్చినట్టుగా ఆ యువతి మాస్ వార్నింగ్ ఇవ్వడంతో నిషాద్ భయంతో వణికిపోయాడు. హనీమూన్కు వెళ్లి మేఘాలయాలో హత్యకు గురైన రఘువంశీ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సర్వేయర్ తేజేశ్వర్ హత్య గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో.. నిషాద్ అనే ఈ కొత్త పెళ్లి కొడుకు బయటపెట్టిన భయంకరమైన నిజాలు బ్యాచిలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.
#BREAKING : Touch me and I’ll cut you into 35 pieces’, Bride threatens groom on wedding night in Prayagraj. later jumps wall to escape with lover.
— upuknews (@upuknews1) June 24, 2025
After the Sonam murder case, a shocking incident from Prayagraj has surfaced. On the wedding night, a bride threatened her husband… pic.twitter.com/QBGDK9SjEK