ఎమ్మెల్సీ ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళతాం: ఉత్తమ్

ఎమ్మెల్సీ ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళతాం: ఉత్తమ్

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తామన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.  గాంధీభవన్ లో  ఉత్తమ్, ,ఇంచార్జ్ కుంతియా, మాజీ మంత్రి జానారెడ్డి, కుసుమకుమార్, మాజీ టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ సమావేశం అయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉత్తమ్.. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక బాధ్యత డీసీసీలకు అప్పగించినట్లు చెప్పారు. ఎంపిటిసి, జడ్పీటీసీ ఓటర్ల జాబితా లేకుండా ఎలా ఎన్నికలు నిర్వహిస్తారని ? ప్రశ్నించారు. చనిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీలను జాబితాలు నుండి తీసేయలేదన్న ఉత్తమ్ ..6 నెలల ముందు ఎన్నికలు జరపాలన్న నిబంధన ఎక్కడా లేదన్నారు.