
హైదరాబాద్ నగర వాసులకు ట్రాఫిక్ అలర్ట్ ప్రకటించారు పోలీసులు. పీసీసీ మీటింగ్ తో ఎల్బీ స్టేడియం వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్స్ అమలులో ఉండనున్నాయి. ఏఆర్ పెట్రోల్ బంక్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. ఆ వెహికిల్స్ ని నాంపల్లి వైపు మల్లిస్తారు.
అబిడ్స్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వెహికిల్స్ ని గన్ ఫౌండ్రి ఎస్బీఐ వద్ద గల చాపెల్ రోడ్ నుంచి నాంపల్లి రోడ్ వైపుకు మల్లిస్తారు. ట్యాంక్ బండ్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వెహికిల్స్ ని లిబర్టీ జుంక్షన్ వద్ద హిమాయత్ నగర్ వైపు మల్లిస్తారు. ఎల్బీ స్టేడియం వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని నగర పోలీసులు సూచించారు.